బీసీసీఐ యూ-టర్న్.. టీమిండియా ప్లేయర్లకు ఇక కష్టాలే!

- తిరిగి ఫిట్నెస్ పరీక్షలను తప్పనిసరి చేయాలని భావిస్తున్న బీసీసీఐ పెద్దలు
- విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న నాటి యో-యో ఫిట్నెస్ టెస్ట్ను మళ్లీ ప్రవేశపెట్టాలని యోచన
- ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీమ్కు సమాచారం ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు
- ఆటగాళ్ల వరుస వైఫల్యంగా ఆగ్రహంగా ఉన్న క్రికెట్ బోర్డ్
ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియా అనూహ్య రీతిలో ఓటముల బాట పట్టింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో అవమానకర ఓటమిని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో, బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు సైతం విఫలమవ్వడంపై సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న రోజుల్లో అమలు చేసిన ఫిట్నెస్ టెస్ట్ రూల్స్ను తిరిగి తప్పని చేయాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం.